A2Z सभी खबर सभी जिले की

పోక్సో కేసులో నిందితుడికి 20సం.ల కఠిన కారాగార శిక్ష

*- విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు*

విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషన్లో 2023 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు
శ్రీకాకుళం జిల్లా గార మండలం, దీపావళి గ్రామానికి చెందిన ఉప్పెనవలస ఉమా మహేశ్వరరావు (20సం.లు)కు
పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే.నాగమణి గారు 20సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు
రూ. 2,500/-లు జరిమానా విధిస్తూ మే 20న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు మే 28న
తెలిపారు.
వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం పట్టణంలో నివాసం ఉంటున్న 14 సంవత్సరాల మైనరు బాలిక 9వ తరగతి చదువుతున్న సమయంలో శ్రీకాకుళం జిల్లా గార మండలం, దీపావళి గ్రామానికి చెందిన ఉప్పెనవలస ఉమా మహేశ్వరరావు (20సం.లు)తో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి నిందితుడు ఫోన్లో మాట్లాడుతూ
ప్రేమిస్తున్నానని నమ్మించి, మోసం చేసి, మైనరు బాలికను శ్రీకాకుళం తీసుకొని వెళ్ళి అత్యాచారంకు పాల్పడినట్లుగా విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా, అప్పటి 2వ పట్టణ ఇన్స్పెక్టరు సిహెచ్.లక్ష్మణ రావు పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేశారు. అనంతరం, ఈ కేసును అప్పటి విజయనగరం మహిళా పిఎస్ ఇన్స్పెక్టరు బి.నాగేశ్వరరావు దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు.
ఈ కేసులో ప్రాసిక్యూషను పూర్తి అయ్యే విధంగా 2వ పట్టణ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టరు టి.శ్రీనివాసరావు
చర్యలు చేపట్టగా, నిందితుడు ఉప్పెనవలస ఉమా మహేశ్వరరావు (20సం.లు) మైనరు బాలికపై అత్యాచారంకు పాల్పడినట్లుగా నేరం రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి గారు నిందితుడికి 20 సంవత్సరాలు కఠిన కారాగారం మరియు రూ.2,500/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని విజయనగరం
డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి రూ.2లక్షల పరిహారంగా ఇప్పించాలని పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యేవిధంగా పోలీసుల తరుపున
ఫోక్సో కోర్టు ఇన్చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటరు మెట్టా ఖజానారావు వాదనలు వినిపించగా, 2వ పట్టణ పోలీసు స్టేషన్
ఇన్స్పెక్టరు టి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో కోర్టు పిసి టి.లక్ష్మి, సి.ఎం.ఎస్. హెచ్సీ సిహెచ్. రామకృష్ణ సాక్షులను కోర్టులో హాజరుపర్చారన్నారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా పోలీసువారి తరుపున వాదనలు వినిపించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెట్టా ఖజానారావు, ఇతర అధికారులను డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు అభినందించారు.

 

Related Articles
Back to top button
error: Content is protected !!